పరిటాల ఫ్యామిలీ గూండాగిరి..జిల్లాకో గ్యాంగ్ లీడర్: వాసిరెడ్డి పద్మ
ఎన్నికల అనంతరం తమ పార్టీ వైకాపాకు చెందిన 16 మందిని టీడీపీ నేతలు పొట్టనబెట్టుకున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. టీడీపీ ఫ్యాక్షనిజానికి ఆ పార్టీకి చెందిన నేతలే భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు.
మంత్రి పరిటాల సునీత, ఆమె కొడుకు శ్రీరామ్, యువసేన పేరిట దౌర్జన్యాలకు దిగుతున్నారన్నారు. పరిటాల సునీత, శ్రీరామ్ల గూండాగిరిపై ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పద్మ ప్రస్తావించారు.
జిల్లాకో గ్యాంగ్ లీడర్ను తయారు చేయడయే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని పద్మ ఆరోపించారు. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ అరాచకాలు నానాటికీ పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు.