1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Venkaiah Naidu enjoys paka idli at Vijayawada's SSS Idli Center

పాక ఇడ్లీకి ఫిదా అయిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

paka idli
విజయవాడలోని మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ కాలనీలోని ఎస్‌ఎస్‌ఎస్‌ ఇడ్లీ సెంటర్‌లో నేతి ఇడ్లీని ఆస్వాదించేందుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచ్చేశారు. ఈ ప్రాంతంలో పాక ఇడ్లీగా పేరొందిన ఈ ఇడ్లీలను ఆరగించేందుకు ఆయన బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌రావుతో కలిసి వెంకయ్యనాయుడు విజయవాడకు వచ్చారు. 
 
ఈ రెస్టారెంట్‌ను సందర్శించిన వెంకయ్య నాయుడు, పాక ఇడ్లీ పట్ల తనకున్న ఇష్టాన్ని తెలియజేస్తూ, పాక ఇడ్లీని ఆరగించారు. మాజీ మంత్రి కామినేనితో పాటు మరికొందరు నేతలు కూడా ఆరగించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు స్పందిస్తూ, నాణ్యమైన భోజనం అందిస్తున్న యజమాని కృష్ణప్రసాద్‌ను అభినందించారు. పిజ్జాలు, బర్గర్‌ల వంటి ఫాస్ట్ ఫుడ్‌ల కంటే సాంప్రదాయ ఆహారాన్ని ఎంచుకోమని యువతను ప్రోత్సహించారు, ఇది వారి ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. 
తర్వాతి కథనం
రూ.20వేలు అప్పు తీసుకుని వడ్డీ కట్టలేదు.. యాసిడ్ దాడి