శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (15:25 IST)

తెలుగు భాష అమృతతుల్యం : వెంకయ్య నాయుడు

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక రోజు పర్యటన నిమిత్తం జెంషెడ్‌పూర‌కు వెళ్లారు. అక్కడ 103 యేళ్ళ నాటి ఆంధ్రభక్త శ్రీరామదాస ఆలయాన్ని సందర్శించారు. తన పర్యటనకు సంబంధించి ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
జంషెడ్‌పూర్‌లోని 103 ఏళ్ల పురాతన ఆంధ్రభక్త శ్రీరామ మందిరాన్నిదర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది. భారత స్వాతంత్ర్య సమర సేనాని సుభాష్ చంద్రబోస్ సూచనలతో ఏర్పడిన ఈ మందిరానికి రావడం.. ఇక్కడి తెలుగువారితో కాసేపు గడపడం మరిచిపోలేని అనుభూతిని కలిగించింది. 
 
తెలుగువారు ఎక్కడున్నా మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను. అమృతతుల్యమైన మన భాషను కూడా బతికించుకోవాలి. ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా.. మన భాషే మన అస్తిత్వం అనే విషయాన్ని మరవొద్దు.