ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (12:24 IST)

తండ్రి సమాధి వద్ద అన్నాచెల్లెలు.. పలుకరింపులు కరువాయే

ysrghat
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి వేడుకలను శుక్రవారం వైకాపా పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని కడప జిల్లా ఇపుడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన వెంట తల్లి, వైఎస్ భార్య విజయలక్ష్మి, భార్య భారతీరెడ్డిల ఉన్నారు.
ysrghat
 
అంతేకాకుండా, తన తండ్రికి నివాళులు అర్పించేందుకు వైఎస్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్. షర్మిల కూడా ఇడుపులపాయకు వచ్చారు. ఈ సందర్భంగా అన్నా చెల్లెళ్లు ఎదురెదురు పడినప్పటికీ ఒకరినొకరు పలుకరించుకోలేదు. నివాళులర్పించక ముందు కానీ.. ఆ తర్వాత కానీ.. జగన్‌, షర్మిల ఒకరినొకరు పలకరించుకోలేదు. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎవరికి వారు ఘాట్‌ నుంచి వెళ్లిపోయారు.
ysrghat