నూనెలోని వెల్లుల్లి గుజ్జును కొంచెం అన్నంలో కలుపుకుని...?

బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (10:13 IST)
చాలామంది కీళ్ళనొప్పులు, నడుము నొప్పులతో తరచుగా బాధపడుతుంటారు. ఇటువంటివారు.. సులువుగా చికిత్సలు చేసుకుంటూ ఉపశమనం పొందవచ్చును. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటి చూర్ణాన్ని త్రికటు చూర్ణం అంటారు. ఈ చూర్ణం ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. దీనిని ఒక చెంచా వరకు తీసుకుని కొంచెం ఉప్పు కలుపుకుని పెరుగులో కలిపి తీసుకుంటే వాతపు వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి తగ్గిపోతుంది.
 
కరక్కాయల లోపలి గింజలు తీసేసి మెత్తగా దంచి 100 గ్రాముల పొడికి 20 గ్రాముల మెత్తని సైంధవ లవణాన్ని కలుపుకుని మజ్జిగతో తీసుకుంటే మలబద్దకం నివారణమవుతుంది. ఒక గ్లాసులో చిక్కటి గంజి తీసుకుని దాంట్లో ఒక చెంచా శొంఠి పొడిని కలిపి కొంచెం ఉప్పు వేసుకుని త్రాగితే కీళ్ళవాతం వారంరోజుల్లో తగ్గిపోతుంది. 
 
100 గ్రాముల వెల్లుల్లిపాయల్ని మెత్తగా దంచి చిక్కటి రసం పిండి, కొంచెం నీరు పోసి బాగా దంచి రసం తీసుకుని ముందు తీసిన చిక్కటి రసంలో కలపాలి. దాంట్లో 100 గ్రాముల నూనె కలిపి పొయ్యిమీద పెట్టి బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నూనెలోని వెల్లుల్లి గుజ్జును కొంచెం అన్నంలో కలుపుకుని తింటుంటే కీళ్ళవాతం, పక్షవాతం, మిగతా వాత వ్యాధులన్నీ నివారిస్తాయి. 

అన్నీ చూడండి

ప్రియుడు గదికి కుమార్తెను బలవంతంగా పంపిన తల్లి... ఎక్కడ?

చంద్రునిపై అన్వేషణ మిషన్లకు మద్దతుగా రోబోటిక్ ల్యాండర్లు, రోవర్లు, డ్రోన్‌లు

అక్రమ సంబంధం.. రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భర్తను హత్య చేయించిన భార్య

ఉగాండా నుండి వచ్చిన మహిళకు ఎబోలా.. బెంగళూరులో ఐసోలేషన్

ఇన్‍‌స్టాలో పరియమైన మహిళ దూరం పెట్టిందనీ చంపేసిన ప్రియుడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

తర్వాతి కథనం
Show comments