అల్లంను అతిగా తీసుకోకూడదట.. ఎందుకో తెలుసా?

గురువారం, 22 నవంబరు 2018 (10:37 IST)
అల్లంను అతిగా తీసుకోవడం ద్వారా గుండెలో మంట, అతిసారం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. గర్భిణీ స్త్రీలు మోతాదుకు మించి అల్లం తీసుకోకూడదు. అలా తీసుకుంటే రక్తస్రావం.. గర్భస్థ శిశువు లైంగిక హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు రోజుకు గ్రాము మాత్రమే అల్లం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
పరగడుపున అల్లం తీసుకోవడం మంచిది కాదు. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం వుంది. కాబట్టి మితంగా తీసుకోవడం ద్వారా ఇలాంటి రుగ్మతల నుంచి దూరం చేసుకోవచ్చు. పసుపు అల్లం టీని తీసుకోవచ్చు కానీ.. అవి కిడ్నీలో రాళ్లు, పిత్తాశయ సమస్యలు వున్నవారు తీసుకోకూడదు. 
 
అలాగే నిద్రించే ముందు అల్లం టీ తీసుకోకూడదు. అలా తీసుకుంటే నిద్రలేమితో బాధపడాల్సి వస్తుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రోజూ ఆహారంలో మితంగా వాడితే కడుపు ఉబ్బరం తగ్గించుకోవచ్చు. గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చునని వారు చెప్తున్నారు. 

అన్నీ చూడండి

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

రైతులకు శుభవార్త - త్వరలో కేరళను తాకనున్న రుతుపవనాలు

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం