పాలు, పెరుగుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

సోమవారం, 8 అక్టోబరు 2018 (11:18 IST)
మెుటిమలు, నల్లమచ్చలు తొలగిపోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. కీరదోస మిశ్రమంలో కొద్దిగా గుడ్డు తెల్లసొన, రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం ముడతలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది.
 
పాలలో కొద్దిగా శెనగపిండి, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై గల మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది. చర్మం పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరినూనెను చర్మానికి రాసుకోవాలి. అరగంట తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. 
 
కీరదోస రసంలో కొద్దిగా నిమ్మరసం, పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన అలసట, ఒత్తిడి తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 

అన్నీ చూడండి

ఆ వేదిక కేవలం అమ్మాయిల కోసమే.. మగాళ్ళు లింగ మార్పిడి చేయించుకున్నారా... ఏంటి? ఎలాన్ మస్క్

ఐదు రోజుల వ్యవధిలో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లి, వీడియో

పరీక్ష పేపర్ ఇస్తాను.. కోరిక తీర్చు : విద్యార్థినికి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు

బోరుబావిలో పడిపోయిన మనవడిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన తాతయ్య, వీడియో

బంగాళాఖాతంలో అల్ప పీడనం.. తమిళనాడులో విస్తారంగా వర్షాలు

అన్నీ చూడండి

Prasanth Varma: తేజ సజ్జ హనుమాన్ చిత్రం 3డిలో రీరిలీజ్ కాబోతోంది

'జయం' రవితో కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ - ఫెమినిజం గెలిచింది.. ఆనందం ఓడిపోయింది..

Ramcharan: పెద్ది ప్రమోషన్ కు ముందు రామ్ చారణ్ కుడిచేతి బ్యాండేజ్ పై అభిమానులు ఆసక్తి

Naga Chaitanya: రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వృషకర్మ

Pavala Shyamala: ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో పావలా శ్యామల..

తర్వాతి కథనం
Show comments