బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 8 జులై 2019 (20:31 IST)

అర టీ స్పూను కీర రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి...

చర్మ సౌందర్యానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాం.
 
1. గంధం పొడి, పసుపు, రోజ్ వాటర్ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే శరీర ఛాయ మెరుగుపడుతుంది. ఎండకు నల్లగా మారిన చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
2. ముల్తానీ మట్టిలో చెంచా బంగాళదుంప గుజ్జు, నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పావుగంట అయ్యాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం తాజాగా తయారవుతుంది.
 
3. అర టీ స్పూను కీర రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్లకు రాసుకుని అరగంట సేపు ఉంచి చల్లని నీళ్లతో కడిగేస్తే కళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి.
 
4. టమోటా గుజ్జు ఒక టీ స్పూను, పెరుగు ఒక టీ స్పూను, రోజ్ వాటర్ అర టీస్పూను... బాగా కలిపి ముఖం, మెడపై రాసుకోవాలి. పరిహేను నిమిషముల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కుని, ఆ తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన ముఖ చర్మం కాంతివంతంగా ఉంటుంది.
 
5. నిమ్మ రసంలో రోజ్ వాటర్ కలిపి రాత్రి వేళ పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. ఇలా కొద్ది రోజులు క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై మొటిమలు తొలగిపోతాయి.
 
6. రెండు టీ స్పూన్ల పసుపులో టీ స్పునూ రోజ్ వాటర్ కలిపి పేస్టు చేసి, ముఖం పై అప్లై చేసుకుని ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి. అలాగే కీరదోస రసంలో రోజ్ వాటర్, గ్లిజరిన్ చుక్కలు వేసి ముఖానికి రాసుకుంటే చర్మం నునుపుదనాన్ని సంతరించుకుంటుంది.