1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జులై 2021 (12:55 IST)

అంతర్జాతీయ విమానాలపై జులై 31 వరకు నిషేధం

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్టి గత యేడాది మార్చి 25వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా గత 16 నెలలుగా ఈ విమాన సర్వీసలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు ఈ విమానాలపై నిషేధం విధించింది. ఈ నిషేధం జూలై 31వ తేదీ వరకు కొనసాగనుంది. 
 
దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గతేడాది మార్చి నుంచి కొనసాగుతున్న ఈ నిషేధాన్ని జులై 31 వరకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓ ప్రకటన చేసింది. 
 
అంతర్జాతీయ విమానాలపై జులై 31 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన డీజీసీఏ.. కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదని పేర్కొంది. అయితే.. ఎంపిక చేసిన మార్గాల్లో మాత్రం అనుమతించిన విమానాల రాకపోకలను ప్రాధాన్య క్రమంలో అధికారుల అనుమతితో నడపవచ్చని డీజీసీఏ తెలిపింది.