శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

21 నుంచి 50 ప్రత్యేక రైళ్ళ పునరుద్ధణ : రైల్వే శాఖ

దెబ్బకు ప్రయాణికులు లేక నిలిపివేసిన అనేక ప్రత్యేక రైళ్లను తిరిగి పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ కసరత్తులు చేపట్టింది. ఇందులోభాగంగా సోమవారం నుంచి మరో 50 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ట్రైన్లను పట్టాలెక్కించగా.. ఈ నెల 21 నుంచి మరిన్ని సర్వీసులను అందుబాటులోకి వస్తున్నట్లు పేర్కొంది. 
 
ఈ నెల 25 నుంచి యూపీ గోరఖ్‌పూర్‌ నుంచి మహారాష్ట్రలోని బాంద్రా టెర్మినస్ వరకు కొత్తగా సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్‌ను ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. సోమవారం నుంచి 50 ప్రత్యేక రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. 
 
జూన్‌ ఒకటో తేదీ నుంచి 18 మధ్య అదనంగా 660 మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. గత శుక్రవారం నాటికి 983 ప్యాసింజర్‌, మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి వచ్చాయి.
 
ఇదిలావుంటే, కరోనా తగ్గుముఖం పడుతుండడంతో డిమాండ్‌ మేరకు రైల్వేశాఖ సర్వీసులను పునరుద్ధరిస్తోంది. పునరుద్ధరిస్తున్న రైళ్లలో న్యూఢిల్లీ - కల్కా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, న్యూఢిల్లీ - డెహ్రాడూన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, న్యూఢిల్లీ - అమృత్‌సర్‌ జంక్షన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, ఢిల్లీ జంక్షన్‌ - కోట్వారా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, చండీగఢ్‌ - న్యూఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, ఢిల్లీ సారాయ్‌ రోహిల్లా - జమ్ముతావి దురంతో, శ్రీమాతా వైష్ణోదేవి కత్రా - న్యూఢిల్లీ శ్రీ శక్తి, కల్కా - సిమ్లా ఎక్స్‌ప్రెస్‌, బిలాస్‌పూర్‌ జంక్షన్‌ - న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌, జమ్ముతావి - యోగానగరి రిషికేశ్‌ ఎక్స్‌ప్రెస్‌, లక్నో - ప్రయాగ్‌రాజ్‌ సంగం ఎక్స్‌ప్రెస్‌, ఛప్రా - లక్నో జంక్షన్ మధ్య ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడువనున్నాయి.