1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (21:41 IST)

హైదరాబాదులో పూర్తి మహిళా శాఖను ప్రారంభించిన పిరమల్ ఫైనాన్స్

piramal Finance
పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ('పిఇఎల్') యొక్క పూర్తి అనుబంధ సంస్థ, పిరమల్ ఫైనాన్స్‌గా విస్తృతంగా గుర్తింపు పొందిన పిరమల్ క్యాపిటల్ & హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, హైదరాబాద్‌లో పూర్తిగా మహిళల చేత నిర్వహించబడుతున్న తమ మొట్ట మొదటి శాఖను డోర్ నెంబర్: 8-1-8, 1వ అంతస్తు, కురా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ డి రోడ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్‌లో ప్రారంభించింది. ఈ శాఖను పిరమల్ ఫైనాన్స్ హెడ్-హెచ్‌ఆర్ పర్నీత్ సోనీ ప్రారంభించారు.
 
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ వద్ద ఏర్పాటు చేసిన 'మైత్రేయి' బ్రాంచ్, గృహ రుణాలు- MSME రుణాలతో సహా కస్టమర్ డిమాండ్, ప్రాధాన్యతల ఆధారంగా అదనపు ఫీచర్‌లకు అవకాశం ఉన్న అనేక రకాల సేవలను అందిస్తుంది. ఈ శాఖ పిరమల్ ఫైనాన్స్ యొక్క వ్యూహాత్మక విస్తరణ ప్రణాళికలో భాగం, ఇందులో రాజస్థాన్‌లోని అజ్మీర్ రోడ్, పంజాబ్‌లోని మొహాలి, కేరళలోని త్రిపునీత్తూరు, న్యూఢిల్లీలోని చత్తర్‌పూర్, మహారాష్ట్రలోని ముంబై వంటి కీలక నగరాల్లో శాఖలను ప్రారంభించడం కూడా ఉంది. ఈ ప్రాంతాలు మా కస్టమర్‌ల అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండేలా, అలాగే పిరమల్ ఫైనాన్స్ యొక్క విస్తృతమైన వ్యాపార వ్యూహానికి మద్దతివ్వడానికి, మా లక్ష్య మార్కెట్‌ల అవసరాలను తీర్చడానికి ఆలోచనాత్మకంగా ఎంపిక చేయబడ్డాయి.
 
ఈ నూతన శాఖల జోడింపుతో, పిరమల్ ఫైనాన్స్ ఇప్పుడు హైదరాబాద్‌లో 14 పూర్తి సేవా శాఖలను కలిగి ఉంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం మొదలైన మార్కెట్‌లను కవర్ చేస్తూ తెలంగాణలో 25 శాఖలను కలిగి ఉంది. దీనితో, కంపెనీ భారతదేశంలోని 1,000 ప్రాంతాలలో చిన్న పట్టణాలకు సైతం విస్తరిస్తూ 500-600 బలమైన బ్రాంచ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని చూస్తోంది.
 
ప్రతి 'మైత్రేయి' శాఖలో 7-15 మంది మహిళా ఉద్యోగులతో కూడిన ప్రత్యేక బృందం ఉంటుంది, ఇందులో అంతర్గత బదిలీలు, కొత్త నియామకాలు ఉంటాయి. ఈ విధానం వినియోగదారుల అవసరాలను సమర్థవంతంగా తీర్చగల విభిన్నమైన, ప్రతిభావంతులైన శ్రామిక శక్తిని నిర్ధారిస్తుంది. మైత్రేయి బ్రాంచ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా పిరమల్‌ ఫైనాన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జైరామ్‌ శ్రీధరన్‌ మాట్లాడుతూ, "సుస్థిర భవిష్యత్తు ఫోర్జింగ్‌లో మహిళల పాత్రపై ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి దృష్టి సారించిన నేపథ్యంలో 'మైత్రేయి' బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మహిళలు  మాత్రమే కలిగిన బ్రాంచ్, వైవిధ్యం- సమ్మిళితత పట్ల మా నిబద్ధతను నొక్కిచెప్పడమే కాకుండా మహిళా నిపుణుల ప్రతిభ, సామర్థ్యాలకు నిదర్శనంగా కూడా ఉపయోగపడుతుంది. మార్కెట్‌గా హైదరాబాద్ మాకు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. మా విస్తరిస్తున్న బ్రాంచ్ నెట్‌వర్క్ రాష్ట్రంలో మా ఉనికిని మరింత బలోపేతం చేస్తుంది. మా శాఖల ద్వారా, వినియోగదారుల ఫైనాన్సింగ్ అవసరాలను తీర్చే సరళీకృత, సమర్థవంతమైన, ప్రభావవంతమైన రుణ పరిష్కారాలను అందించాలని మేము కోరుకుంటున్నాము, స్థిరమైన భవిష్యత్తుకు సాధికారత పొందిన మహిళలు కీలకమైన తోడ్పాటు అందిస్తారనే  దృక్పథానికి మద్దతు ఇస్తున్నాము" అని అన్నారు.