1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (12:51 IST)

రక్షా బంధన్ : ఎస్బీఐ బంపర్ ఆఫర్ - 20 శాతం మేరకు డిస్కౌంట్

రాఖీ పండుగను పురస్కరించుకుని భారతీయ స్టేట్ బ్యాంకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఎస్బీఐ... రక్షా బంధన్ నేపథ్యంలో ఆన్‌లైన్ కోనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా యోనో యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
 
ఎస్‌బిఐ విడుదల చేసిన ప్రకటన మేరకు... ఫెర్న్స్ యాంట్ పెటల్స్ కంపెనీ బహుమతి కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. అయితే, ఈ ఆఫర్ రూ.999 వరకు బహుమతులపై మాత్రమే వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి, వినియోగదారులు ఎస్బీఐ యోనో యాప్‌ని ఉపయోగించాలి. 
 
ఇకపోతే, బహుమతి కొనుగోళ్లపై 20 శాతం వరకు తగ్గింపు ప్రయోజనాన్ని పొందడానికి కస్టమర్లు యోనో యాప్ ద్వారానే చెల్లింపులు జరపాలి. ఈ ఆఫర్‌కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే.. ఎస్బీఐ యోనో, ఎస్బీఐయోనో డాట్ ఎస్బీఐ  అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 
 
ఎస్‌బిఐ ఆఫర్ ఆగస్టు 22 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రాఖీ పండుగ ఆగస్టు 22న ఉంది, ఆ రోజు వరకు 20 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌లో కనీస కొనుగోలు పరిమితి లేదు. 
 
అయితే, గరిష్ట పరిమితి రూ.999 గా నిర్ణయించబడింది. రూ.999 వరకు మాత్రమే కొనుగోళ్లపై 20 శాతం డిస్కౌంట్ ప్రయోజనం లభిస్తుంది. దీని కోసం ఎస్బీఐ ఒక కోడ్ జారీ చేసింది. ఈ కోడ్ నంబర్ ఎస్‌బిI20 ఇది షాపింగ్ చేసేటప్పుడు అప్లై చేయాల్సివుంటుంది.