1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (22:48 IST)

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించిన ఏపీ సర్కారు

ఏపీ సర్కారు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించింది.  ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ పెట్రోల్‌ పై రూ.1.51, డీజిల్‌పై రూ. 2.22 మేర వ్యాట్‌ తగ్గింది. ఈ నిర్ణయంతో డీజిల్‌పై ఏడాదికి రూ. 888 కోట్లు, పెట్రోల్‌పై రూ. 226 కోట్ల మేర వ్యాట్‌ ద్వారా వచ్చే ఆదాయంలో తగ్గనుంది.
 
కేంద్రం తగ్గించిన ఎక్సైజు డ్యూటీ అనంతరం ఏపీలో డీజిల్ పై రూ. 8.68, పెట్రోలుపై రూ. 4.85 కు వ్యాట్ తగ్గింది. ఏడాదికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 150 కోట్ల లీటర్ల పెట్రోలు వినియోగం అవుతోంది. దీంతో వినియోగదారులకు రూ. 226 కోట్ల మేర లబ్ది కలుగుతుందని పేర్కొంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. 
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదికి 400 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం అవుతోంది. ఇక తాజా వ్యాట్ తగ్గింపుతో 888 కోట్ల రూపాయల మేర లబ్ది ఉందని చెబుతోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. మొత్తంగా ఏడాదికి రూ. 1114 కోట్ల మేర ఏపీ సర్కార్ నష్టం వాటిల్లనుంది