సంబంధిత వార్తలు
- టెస్ట్ కెరీర్కు టాటా చెప్పనున్న రవీంద్ర జడేజా?
- వార్షిక సభ్యత్వాన్ని పెంచిన అమెజాన్ - 60 శాతం తగ్గించి నెట్ఫ్లిక్స్
- ఓటీటీ కల్చర్ అదుర్స్.. నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ధరలు డౌన్
- సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) డైరెక్టర్ జనరల్గా చేరిన అర్వింద్ కుమార్
- పిల్లల్ని పట్టుకుంటున్న కరోనావైరస్: ఇండోనేషియాలో 6-11 ఏళ్ల వారికి టీకా
దేశంలో 6,984 కేసులు.. కేరళలోనే 3,377 కరోనా కేసులు
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. కానీ, కేరళ రాష్ట్రంలో మాత్రం ఈ కేసుల నమోదులో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. గడిచిన 24 గంటల్లో కూడా ఏకంగా 3,344 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వీటితో కలుపుని దేశ వ్యాప్తంగా మొత్తం 6,984 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్రవైద్య ఆరోగ్య శాఖ విడుదలచేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఈ వైరస్ సోకి గత 24 గంటల్లో 247మంది చనిపోగా, 8168 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ మృతుల్లో కేరళ రాష్ట్రంలో 28 మంది ఉన్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 87562 మంది యాక్టివ్ కేసులు ఉండగా వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. అలాగే, కరోనా నుంచి దేశం ఇప్పటివరకు 3,41,46,931 మంది కోలుకోగా, 4,76,135 మంది చనిపోయారు. అలాగే, 1,34,61,14,483 మందికి కరోనా వ్యాక్సిన్ డోస్లను వేశారు.
తర్వాతి కథనం
