మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 అక్టోబరు 2020 (12:02 IST)

తెలంగాణాలో కొత్తగా 1436 పాజిట్ కేసులు - ఆరు మరణాలు

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అలాగే, మరణాల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది. ఆదివారం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలా మేరకు గడిచిన 24 గంటల్లో 1,436 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే, కరోనాతో ఆరుగురు మరణించారు. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 2,22,111 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కోవిడ్‌-19తో 1,271 మంది మృతిచెందారు. శనివారం నాటికి రాష్ట్రంలో 22,050 యాక్టివ్‌ కోవిడ్‌ కేసులు ఉన్నాయి. శనివారం ఒక్కరోజు వ్యాధి నుంచి 2,154 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో కలిపి రాష్ట్రంలో వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,98,790గా ఉంది. దేశవ్యాప్త రివకరీ రేటు 88 శాతంగా ఉండగా అదే రాష్ట్రంలో 89.5 శాతం ఉంది. 
 
ఇకపోతే, తెలంగాణాలోని జిల్లాల వారీగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, ఆదిలాబాద్‌లో 12, భద్రాద్రి కొత్తగూడెం-77, జీహెచ్‌ఎంసీ-249, జగిత్యాల-27, జనగాం-21, భూపాలపల్లి-18, గద్వాల్‌-11, కామారెడ్డి-34, కరీంనగర్‌-76, ఖమ్మం-78, ఆసిఫాబాద్‌-16, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌లో 30 చొప్పున నమోదయ్యాయి. 
 
అలాగే, మంచిర్యాల-23, మెదక్‌-20, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి-105, ములుగు-21, నాగర్‌కర్నూలు-24, నల్లగొండ-75, నారాయణపేట-3, నిర్మల్‌-21, నిజామాబాద30, పెద్దపల్లి-20, సిరిసిల్ల-27, రంగారెడ్డి-110, సంగారెడ్డి-34, సిద్దిపేట-67, సూర్యాపేట-28, వికారాబాద్‌-25, వనపర్తి-21, వరంగల్‌ రూరల్‌-24, వరంగల్‌ అర్బన్‌-59, యాదాద్రి భువనగిరిలో 20 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 
 
ఇదిలావుంటే, భారత్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 61,871 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,94,552 కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 1,033 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,14,031 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 65,97,210 మంది కోలుకున్నారు. 7,83,311 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,42,24,190 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,70,173 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.