1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

చిన్న పిల్లలకు త్వరలోనే కరోనా వ్యాక్సిన్లు : కేంద్రం

దేశంలో త్వరలోనే చిన్న పిల్లలకు కూడా కరోనా వైరస్ టీకా కార్యక్రమం ప్రారంభమవుతుందని కేంద్ర వైద్ ఆరోగ్య శాఖామంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వెల్లడించారు. 
 
దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జోరుగా సాగుతుందని, ప్రస్తుతం 18, అంతకన్నా ఎక్కువ వయసున్న వారికే కొవిడ్‌ టీకాలు వేస్తున్నారు. కాగా 12-18 ఏళ్ల వారికి జులై ఆఖరు లేదా ఆగస్టులో వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావచ్చని ఇటీవల కొవిడ్‌-19 జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగీ) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.కె.ఆరోడా తెలిపిన సంగతి తెలిసిందే.