1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (11:07 IST)

ఢిల్లీపై కరోనా వైసర్ పంజా - 300 మంది ఖాకీలకు పాజిటివ్

దేశ రాజధాని ఢిల్లీపై కరోనా పంజా విసిరింది. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వైరస్ దెబ్బకు హస్తినవాసులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. ఒక్క ఆదివారమే ఏకంగా 300 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, పార్లమెంట్‌లో పని చేసే సిబ్బందిలో దాదాపు 400 మంది వరకు ఈ వైరస్ సోకింది. 
 
ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని విభాగాలకు చెందిన పోలీసులకు ఈ వైరస్ సోకింది. వీరంతా గత కొంతకాలంగా కోవిడ్ ఆంక్షలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇలాంటి వారిలో అనేక మందికి ఈ వైరస్ సోకింది. దీంతో మిగిలిన పోలీసులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. 
 
ఇదిలావుంటే ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 23.53 శాతంగా ఉంది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,49,730గా చేరుకుంది. ఇందులో 60733 యాక్టివ్ కేసులు అందుబాటులో ఉన్నాయి. అలాగే, మరో 1463837 మంది ఈ వైరస్ బారినుంచి కోలుకున్నారు.