గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (10:56 IST)

దేశంలో రోజుకో రికార్డు నెలకొల్పుతున్న కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ రోజుకో రికార్డు నెలకొల్పుతోంది. ప్రతి రోజూ భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా ఒక్క రోజులోనే ఏకంగా 75 వేలకు మించిన పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం ఇపుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఫలితంగా గడచిన 24 గంటల్లో 77,266 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 1,057 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 33,87,501కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 61,529కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 25,83,948 మంది కోలుకున్నారు. 7,42,023 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. 
 
కాగా, దేశంలో గురువారం వరకు మొత్తం 3,94,77,848 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. గురువారం ఒక్కరోజులోనే 9,01,338  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.