శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జులై 2021 (10:29 IST)

దేశంలో కొత్తగా మరో 38 వేల కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా మరో 38 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 38,164 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో తెలిపింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,11,44,229కు చేరింది. అలాగే, ఆదివారం 38,660 మంది కోలుకున్నారు. 
 
ఇక మృతుల విషయానికి వస్తే, ఆదివారం 499 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,14,108కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,03,08,456 మంది కోలుకున్నారు. 
 
4,21,665 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 40,64,81,493 వ్యాక్సిన్ డోసులు వేశారు.    
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 44,54,22,256 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 14,63,593 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.