1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:18 IST)

మహారాష్ట్రలో కరోనా వినాశనం.. ప్రతి మూడు నిమిషాలకు కోవిడ్‌తో వ్యక్తి మృతి

మహారాష్ట్రలో కరోనా వినాశనం కొనసాగుతోంది. మహారాష్ట్రలో ప్రతి గంటకు రెండు వేల కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిమిషానికి 2859 మంది కరోనా వైరస్‌తో సంబంధం కలిగి ఉన్నారని, ప్రతి మూడు నిమిషాలకు ఒక వ్యక్తి ఈ వైరస్ బారిన పడి మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆదివారం మహారాష్ట్రలో 68 వేల 631 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 
 
ఒక రోజులోనే కరోనా కేసులు రావడం ఇదే మొదటిసారి. అంతేగాకుండా ఆదివారం రాష్ట్రంలో 503 మరణాలు కూడా నమోదయ్యాయి. దీంతో కరోనా నుండి మరణించిన వారి సంఖ్య 60 వేలు దాటింది. కొత్త కేసుల్లో 8 వేల 468 కేసులు ముంబైకి చెందినవి. ముంబైలో మాత్రమే 12,354 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 53 మరణాలు ఆదివారం నమోదయ్యాయి.
 
 
 
మహారాష్ట్రలో ప్రస్తుతం 'మినీ లాక్‌డౌన్' అమల్లో ఉంది. ఇంకా వీకెండ్ లాక్డౌన్, సెక్షన్ 144 కూడా రాష్ట్రంలో వర్తిస్తుంది.
 
కరోనా కేసులు పెరగడం వల్ల మహారాష్ట్రలో ఆరోగ్య సేవలు కుప్పకూలిపోయాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది.
 
ఇదిలావుండగా, 'ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్' రైళ్ల ద్వారా రాష్ట్రంలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయనున్నట్లు భారత రైల్వే ప్రకటించింది.
 
అయితే, మహారాష్ట్రలో ఆక్సిజన్ కొరత కారణంగా ఏ కరోనా రోగి మరణించలేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఆదివారం పేర్కొన్నారు. కరోనా రోగులు ఆసుపత్రిలో ఆలస్యం కావడంతో చనిపోతున్నారన్నారు.