మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (11:56 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్.. తెలంగాణలో 1,500 మార్కుకు చేరిన మృతుల సంఖ్య

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన కోవిడ్-19 కేసుల వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,891 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,878 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,08,535కి చేరింది. 
 
ఇప్పటివరకు మొత్తం 1,80,953 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,500 మార్కుకు చేరింది. ప్రస్తుతం 26,374 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 285, రంగారెడ్డి జిల్లాలో 175 కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు ఏపీలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 66,944 శాంపిల్స్ పరీక్షించగా మరో 5292 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 7,36,824కు చేరింది. 
 
గడిచిన 24 గంటల్లో 42మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6128కి చేరింది. గత 24 గంటల్లో 6,120మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 6,84,930 నమోదయ్యింది. మరో 48,661మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.