గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (09:36 IST)

తెలంగాణలో మళ్లీ కరోనాకు రెక్కలొచ్చాయ్.. 24 గంటల్లో 2వేల కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టింది. అయినా పాజిటివ్‌ కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. ఒక రోజు తగ్గినా.. మరొక రోజు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య కూడా పెంచింది ప్రభుత్వం. గతంలో హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో మాత్రమే కరోనా పరీక్షలు చేసేవారు. 
 
ప్రస్తుతం మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలకు మరింత సునాయాసంగా మారింది. గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్‌ కేసుల గురించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
గడిచిన 24 గంటల్లో 2,058 పాజిటివ్‌ కేసులు నమోదైనాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో - 277, రంగారెడ్డి - 143,  కరీంనగర్‌ - 135, వరంగల్‌ అర్బన్‌ - 108, సిద్దిపేట - 106, ఖమ్మం - 103 కేసులు నమోదైనాయి.