శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 27 జులై 2017 (19:16 IST)

భారత క్రికెటర్లకు దిమ్మదిరిగిపోయే షాక్...

టీమిండియా క్రికెటర్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. ద్వంద్వ ప్రయోజనాలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగా, భారత క్రికెటర్లు తమతమ ఉద్యోగాలను వదులుకోవాలని సూచన చ

టీమిండియా క్రికెటర్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. ద్వంద్వ ప్రయోజనాలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగా, భారత క్రికెటర్లు తమతమ ఉద్యోగాలను వదులుకోవాలని సూచన చేసింది. 
 
వాస్తవానికి ద్వంద్వ ప్రయోజనాలకు బీసీసీఐ వ్యతిరేకం. ఈనేపథ్యంలోనే రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈనేపథ్యంలో బీసీసీఐలో ఏ, బీ, సీ గ్రేడ్ కాంట్రాక్టులతో ప్రయోజనం పొందుతున్న ఆటగాళ్లు, పలు సంస్థల్లో ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ద్వంద్వ ప్రయోజనం పొందుతున్నారు. 
 
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓఎన్జీసీలో ఉన్నత స్థానంలో ఉన్నాడు. అలాగే వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, ఛటేశ్వర్ పుజారాలు ప్రభుత్వ సంస్థల్లో వివిధ స్థాయి ఉద్యోగులుగా ప్రయోజనాలు పొందుతున్నారు. 
 
ఈనేపథ్యంలో పని చేస్తున్న సంస్థలకు రాజీనామా చేయాలని కోరుతూ బీసీసీఐ ఉత్తర్వులు జారీచేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఉత్తర్వులు టీమిండియాకు మాత్రమేనా? మహిళా క్రికెట్ జట్టుకు కూడా వర్తిస్తుందా? అన్న దానిపై పూర్తి వివరాలు తెలియలేదు. మహిళా క్రికెటర్లలో కొందరు రైల్వేల్లో ఉద్యోగులుగా ఉన్నారు. మిథాలీ రాజ్ రైల్వే శాఖలో ఉద్యోగిణి అన్న సంగతి తెలిసిందే. మొత్తంమీద బీసీసీఐ క్రికెటర్లకు షాకిచ్చింది.