శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 జులై 2017 (09:49 IST)

వాళ్లు పాకిస్థాన్‌ను చిత్తు చేశారు... వీరు వెస్టిండీస్‌ చేతిలో ఓడారు

భారత క్రికెట్‌ అభిమానులకు ఒక శుభవార్త.. మరొకటి అశుభవార్త. భారత మహిళా క్రికెట్ జట్టు పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడిస్తే.. భారత క్రికెట్ జట్టు మాత్రం వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్‌లు ఆదివారమ

భారత క్రికెట్‌ అభిమానులకు ఒక శుభవార్త.. మరొకటి అశుభవార్త. భారత మహిళా క్రికెట్ జట్టు పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడిస్తే.. భారత క్రికెట్ జట్టు మాత్రం వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్‌లు ఆదివారమే జరిగాయి.
 
మహిళల ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టుపై భారత జట్టు ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌పై 95 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి భారత్ 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేయగా, ఆస్కోరును ఛేదించే క్రమంలో పాకిస్థాన్ జట్టు 74 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లు బిష్ట్ 5 వికెట్లు, జోషి 2, గోస్వామి, శర్మ, కౌర్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. 
 
అలాగే, కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న టీమిండియా.. ఆదివారం అంటిగ్వా వేదికగా జరిగిన నాలుగో వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 178 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్లు లూయిస్ 35, హోప్‌ 35 ఎస్‌హోప్‌ 25 ర‌న్స్‌ స్కోరు చేయగా, భారత బౌలర్లు ఉమేష్ 3, పాండ్య 3, కుల్దీప్ 2 వికెట్లు తీశారు. భారత జట్టు బ్యాట్స్‌మెన్లు రహానే 60, ధోని 54, పాండ్య 20 పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లు హోల్డర్ 5, జోసెఫ్ 2, విలియమ్స్, బిషూ, నర్స్ తలో వికెట్ తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఐదు వికెట్లు తీసిన హోల్డర్ నిలిచాడు.