KA Paul: చిన్నవాడైన రామ్మోహన్కి ఏవియేషన్పై అవగాహన లేదు: కే.ఏ.పాల్
విమానయాన శాఖ ఎంతో క్లిష్టమైనది.. చిన్నవాడైన రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్పై అవగాహన లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుభవం లేని రామ్మోహన్ నాయుడు ఆ శాఖకు పనికిరాడని కేఏ పాల్ అన్నారు.
ఏవియేషన్ అనుభవం ఉన్న ఎంపీకి విమానయాన శాఖను అప్పగించాలని డిమాండ్ చేశారు. రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలన్నారు. అలాగే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది ఉగ్రవాదుల దాడి అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటనలో 242 మంది ప్రయాణికులు మరణించడం బాధాకరమని, దీనిపై వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలిపోయిన ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి సహా 242 మంది మరణించారు.
ఈ ఘటనపై వెంటనే విచారణ చేయాలని, చనిపోయినవారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, ఈ ప్రమాదంలో చనిపోయినవారికి సంతాపం తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.
ఎయిరిండియా బోయింగ్ విమానం లండన్కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలి మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 242మంది చనిపోయారు.