1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2023 (19:33 IST)

హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి-బుమ్రా రీఎంట్రీకి ముహూర్తం

స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెలలో ఐర్లాండ్‌తో భారత జట్టు మూడు టీ20లు ఆడనుంది. వీటిలో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇస్తారని కొన్నిరోజులుగా వార్తలు వచ్చాయి. వాటిని బీసీసీఐ తాజాగా ధ్రువీకరించింది. 
 
ఐర్లాండ్ పర్యటనకు ప్రకటించిన జట్టులో పాండ్యా పేరు లేదు. ఈ సిరీసులో టీమిండియా కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసింది. అలాగే అతని డిప్యూటీగా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసింది.
 
ఇలాంటి సమయంలో ఈ సిరీస్ అతనికి చాలా ఉపయోగపడేలా కనిపిస్తోంది. ఈ నెల 18, 20, 23వ తేదీల్లో మలాహిదె, డబ్లిన్‌ వేదికలుగా ఐర్లాండ్‌, భారత్ మూడు మూడు టీ20లు ఆడనున్నాయి. 
 
ఈ సిరీస్‌ కోసం 15మందితో కూడిన భారత జట్టును సోమవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌లో సీనియర్లు రోహిత్‌, కోహ్లీతో పాటు హార్దిక్‌ పాండ్యాకు కూడా విశ్రాంతినిచ్చింది.