శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (13:19 IST)

అక్మల్ వేస్ట్.. అతన్ని తీసుకున్నపుడే ఓడిపోయింది : ఇమ్రాన్

భారత్‌తో జరిగే మ్యాచ్‌ కోసం పాకిస్థాన్ తుది జట్టులోకి వికెట్ కీపర్‌గా ఉమర్ అక్మల్‌ను తీసుకున్నపుడే తమ దేశ జట్టు సగం ఓడిపోయిందని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ రాజకీయ నేత ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఆదివారం వెల్లడైన ఈ మ్యాచ్ ఫలితంపై ఆయన స్పందిస్తూ చాలా కాలం తర్వాత తాను క్రికెట్ మ్యాచ్ చూశానని, అయితే పాకిస్థాన్ ఆటతీరు ఇంత దారణంగా ఉంటుందని అనుకోలేదన్నారు. 
 
ముఖ్యంగా వికెట్ కీపర్ ఉమర్ అక్మల్... విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అతడిని ఆడించటమే పొరపాటని, అందుకే తమ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందని ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్లు చేశారు. పాకిస్థాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్‌ ఆటతీరుపై ప్రశంసలు కురిపించిన ఇమ్రాన్ ఖాన్ ఈ వరల్డ్ కప్‌లో ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నందున పాక్ ఆటగాళ్లు పాఠాలు నేర్చుకోవాలని బ్యాట్స్‌మెన్‌కు సూచించాడు.