మొహాలీ టెస్ట్ : భారత్ బ్యాటింగ్.. ధవాన్ డకౌట్...
భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం నుంచి మొహాలీ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ దిగిన కోహ్లీ సేనకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత ఓపెనర్ శిఖర్ ధవాన్ నాలుగు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ను సమర్పించుకని పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం మరో ఓపనర్ విజయ్, పుజరాలు క్రీజ్లో ఉన్నారు.
ఇదిలావుండగా, ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఫ్రీడమ్ సిరీస్లో ఇప్పటికే టీ20, వన్డే టైటిళ్లను చేజార్చుకున్న టీమిండియా టెస్టు టైటిల్ను అయినా దక్కించుకుని పరువు నిలుపుకోవాలని యత్నిస్తోంది. మరోవైపు ప్రత్యర్థి జట్టు సొంత గడ్డపైనే రెండు టైటిళ్లను సులువుగా చేజిక్కించుకున్న సఫారీలు టెస్టు టైటిల్ను కూడా సాధించి చరిత్ర తిరగరాయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్ కోసం బరిలోకి దిగిన ఇరు జట్లు...
భారత్ : విజయ్, ధవాన్, పుజారా, కోహ్లీ, రహానే, షా, జడేజా, అశ్విన్, మిశ్రా, అరోన్, యాదవ్.
సౌతాఫ్రికా : ఎల్గర్, జైల్, డు ప్లెసిస్, ఆమ్లా, డివిలియర్స్, విలాస్, ఫిలిందర్, హార్మర్, స్టెయిన్, రబడ, ఇమ్రాన్ తాహీర్.