గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2017 (13:34 IST)

రోహిత్ శర్మ వీరబాదుడు... ట్వంటీ20 సిరీస్ భారత్ కైవసం

పర్యాటక శ్రీలంక జట్టుతో ఇండోర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది.

పర్యాటక శ్రీలంక జట్టుతో ఇండోర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ వీరవిహారం చేసి కేవలం 35 బంతుల్లో సెంచరీ బాదాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.
 
ఆ తర్వాత 261 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 17.2 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. భారత బౌలర్లలో చాహల్(4), కుల్దీప్ (3), పాండ్యా(1), జయదేవ్(1) వికెట్లతో శ్రీలంక నడ్డి విడిచారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి టీ20 డిసెంబర్ 24న ముంబైలో జరగనుంది.
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ 118(10 పోర్లు, 12 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, రాహుల్ 89, ధోనీ (28) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో ప్రదీప్(2), పెరెరా(2) చమీర (1) వికెట్లు పడగొట్టారు.