1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (11:47 IST)

#కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్- రెండో వన్డేలో విండీస్‌కు మైదానంలో చుక్కలు

వెస్డిండీస్‌తో విశాఖలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో ఓపెనర్ల ధాటికి 387 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన విండీస్ 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్‌లో కులదీప్ యాదవ్ చెలరేగిపోయాడు. హ్యాట్రిక్ వికెట్లు తీసి… రెండు సార్లు వన్డేల్లో హ్యాట్రిక్ వికెట్ తీసిన ఏకైక భారత బౌలర్‌గా నిలిచాడు. 33వ ఓవర్ నాలుగో బంతికి హోప్‌ని అవుట్ చేసిన యాదవ్ తర్వాతి బంతికే హోల్డర్‌ని బోల్తా కొట్టించాడు.
 
ఆఖరి బంతికి… జోసేప్గ్‌ని పెవేలియన్ చేర్చాడు.. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ పోరాడినా ఫలితం లేకపోయింది. అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో… విండీస్ ఓటమి లాంచనం అయింది.

43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత బౌలర్లలో కులదీప్, శమీ తలో మూడు వికెట్లు తీయగా… జడేజా రెండు, ఠాకూర్ ఒక వికెట్ తీసారు. 159 పరుగులతో సత్తా చాటిన ఓపెనర్ రోహిత్ శర్మకు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే కటక్‌లో ఆదివారం జరగనుంది.