శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (11:42 IST)

నా భర్తను ఐపీఎల్ టోర్నీలో ఆడనివ్వొద్దు : షమీ భార్య

భారత క్రికెటర్ మహ్మద్ షమీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయన భార్య తాజాగా అతన్ని ఐపీఎల్‌ టోర్నీలో ఆడనివ్వొద్దని కోరింది. ఈ మేరకు ఆమె షమీని కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కలిసి విజ్ఞప్తి చేసింద

భారత క్రికెటర్ మహ్మద్ షమీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయన భార్య తాజాగా అతన్ని ఐపీఎల్‌ టోర్నీలో ఆడనివ్వొద్దని కోరింది. ఈ మేరకు ఆమె షమీని కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కలిసి విజ్ఞప్తి చేసింది. ఫ్రాంచైజీ సీఈఓ హేమంత్ దువాని జహాన్ ఇటీవల కలిసింది. 'హేమంత్ ఎదుట నా బాధను వినిపించాను. కుటుంబ సమస్యను పరిష్కరించుకునేంత వరకు షమీని ఐపీఎల్‌లో ఆడనివ్వొద్దని ఆయన్ను కోరాను' అని జహాన్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపింది.
 
కాగా, ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఐపీఎల్ వేలంపాటలో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ షమీని రూ.3 కోట్లకు తిరిగి దక్కించుకున్న సంగతి తెలిసిందే. షమీకి పలువురు యువతులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, అతను తనను శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేశాడని జహాన్ గతంలో సంచలన ఆరోపణలు చేసింది. వాటితో పాటు ఆమె చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి మాత్రం షమీకి బీసీసీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. కాగా, ఈనెల 7వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానుంది.