1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Rohit Sharma Breaks WORLD RECORD, Becomes 1st Player Ever To...

లార్డ్స్‌లో రోహిత్ శర్మ సెంచరీ.. తొలి భారత బ్యాటర్‌గా రికార్డు

Rohit Sharma
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటర్‌ రోహిత్‌ శర్మ 84 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ ప్రతిష్ఠాత్మక మైదానంలో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్‌ రికార్డు సృష్టించాడు. వన్డే చరిత్రలోనే ఎక్కువ వయసులో (39 సంవత్సరాల 80 రోజులు) సెంచరీ సాధించిన భారత ఆటగాడిగానూ రోహిత్ నిలిచాడు. 
 
ఇంగ్లండ్‌ గడ్డపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు (8) చేసిన పర్యాటక ప్లేయర్‌గానూ హిట్‌మ్యాన్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ శతకం పూర్తి చేసుకోగానే లార్డ్స్‌ బాల్కనీలో ఉన్న భారత ఆటగాళ్లు, హెడ్ కోచ్ గంభీర్ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. 31 ఓవర్లకు భారత్ స్కోరు 206/1. రోహిత్ (102), కోహ్లీ (23) క్రీజులో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది.
 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి