శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 జులై 2014 (12:04 IST)

ముంబైలో ప్రొ కబడ్డీ లీగ్ : సచిన్ కపుల్స్‌తో పాటు తారల సందడి!

ముంబైలో శనివారం ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమైంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులు..  బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ జంట.. అందాల తార ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు.. వీరితో పాటు బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్.. పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ..  ఇలా హేమాహేమీలంతా ఓ చోట కలిశారు. ఈ అరుదైన సన్నివేశానికి కబడ్డీ లీగ్ వేదికైంది. 
 
అందరూ కలసి కబడ్డీ మ్యాచ్ను వీక్షించారు. బచ్చన్ ఫ్యామిలీ మొత్తం తరలివచ్చింది. జైపూర్ ఫ్రాంచైజీ యజమాని అయిన అభిషేక్.. సచిన్ను ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో జైపూర్ పాంథర్స్... ముంబై జట్టు చేతిలో ఓడిపోయింది.