1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (11:55 IST)

కోర్కె తీర్చుకున్నాడు.. కాదు పొమ్మన్నాడు... ఎందుకు?

victim
పలువురు కామాంధులు అమ్మాయిల బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ కోవలో ప్రేమ పేరుతో ఓ అమ్మాయిని లొంగ దీసుకుని శారీరక సుఖం అనుభవించాడు. తీరా పెళ్లి చేసుకోమని కోరడంతో కాదు పొమ్మన్నాడు. బాధితురాలు ఓ వివాహిత కావడం గమనార్హం. తన భర్తకు విడాకులు ఇచ్చి, దేశాలు దాటి మరీ వచ్చింది. తీరా కోరిక తీరాక ఆ యువతిని వదిలి మరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
హైదరాబాద్ బోరబండ రాజ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి (27) టెలీకాలర్‌గా పని చేస్తుంది. ఈ యువతికి ఐదేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో మహారాష్ట్ర జల్‌గావ్‍‌కు చెందిన సైఫ్ (28) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడి, ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో వారిద్దరూ హైదరాబాద్ నగరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు.
 
అయితే, యువతి తరపు కుటుంబ సభ్యులు వారి పెళ్లికి నిరాకరించారు. దీంతో 2020లో ఆమెకు మరో వ్యక్తితో వివాహం చేసి దుబాయ్‌కు పంపించారు. ఆ యువతి భర్తతో కలిసి దుబాయ్‌కు వెళ్ళినప్పటికీ తన ప్రియుడు సైఫ్‌తో మాత్రం కాంటాక్ట్‌లోనే ఉంది. వారిద్దరూ చాటింగ్‌లు చేసుకోవడం, ఫోన్లు చేసుకోవడం చేయసాగారు. ఈ నేపథ్యంలో కట్టుకున్న భర్తకు విడాకులిచ్చి స్వదేశానికి వస్తే పెళ్లి చేసుకుంటానని సైఫ్ నమ్మించాడు. 
 
అతని మాటలు నమ్మిన ఆమె భర్తకు విడాకులిచ్చి స్వదేశానికి వచ్చింది. ఈ క్రమంలో మొదటి భర్త ద్వారా అయిన గర్భంకూడా సైఫ్ తొలగించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉండసాగారు. అలా రోజులు గడిచిపోతున్నాయే గానీ.. పెళ్లికి మాత్రం సైఫ్ ససేమిరా అంటున్నారు. పైగా, స్వగ్రామంలో మరో అమ్మాయితో ఈ నెల 22వ తేదీన పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.