1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: శనివారం, 22 జనవరి 2022 (22:31 IST)

మామిడితోపులో ప్రియుడితో భార్య, భర్త రాగానే చెట్టుకు కట్టేసి చితకబాదారు...

ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త రైతు. ఆర్థికంగా బాగానే స్థిరపడ్డ కుటుంబం. ఉదయం వెళ్ళే భర్త పొలంలో పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు. ఇక పిల్లలు ఉదయాన్నే సాయంత్రానికి ఇంటికి వచ్చేవారు. తాను ఒంటరిగా ఫీలయ్యింది మహిళ. చేతిలో ఫోన్ కూడా లేదు. టైం పాస్ కోసం ఇంటి పక్కనే యువకుడితో మాట్లాడుతుండేది. ఆ యువకుడు కాస్తా ఆమెను పక్కదారి పట్టించి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అతడితోనే జీవితం అనుకుని అతడితో కలసి పారిపోయింది.

 
చిత్తూరుజిల్లా బంగారుపాళ్యెం మండలం వంకరవారిపల్లికి చెందిన గణేష్, నందినిలకు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గణేష్‌ను నందిని ఎన్నో నెలలుగా ఫోన్ కొనివ్వమని అడుగుతోంది. అయితే పల్లెటూరు కావడంతో ఫోన్‌తో పనిలేదని చెబుతూ ఉండేవాడు భర్త.

 
ఇంట్లో పిల్లలు లేకపోవడం.. భర్త కూడా పొలానికి వెళ్ళిపోతుండటంతో ఇంట్లో ఒంటరిగా ఉండేది నందిని. ఈ క్రమంలో ఇంటి పక్కన ఉన్న రెడ్డెప్ప పరిచమయ్యాడు. యువకుడు. డిగ్రీ పూర్తి చేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉండేవాడు. దీంతో అతనితో మూడు నెలల నుంచి అక్రమ సంబంధం పెట్టుకుంది నందిని. భర్తకు తెలిసి మందలించాడు. అయినా వినిపించుకోలేదు. నిన్న మధ్యాహ్నమే సడెన్‌గా ఇంటికి వచ్చాడు గణేష్. ఇంట్లో భార్య లేదు. దీంతో భార్యను వెతుక్కుంటూ వెళ్ళాడు. తన ఇంటికి సమీపంలోని మామిడితోపులో ప్రియుడితో ఎంజాయ్  చేస్తూ కనిపించింది భార్య.

 
ఏకాంతంగా ఇద్దరూ ఉన్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గణేష్ రెడ్డెప్పపై దాడికి ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న రెడ్డెప్ప, నందినిలు గణేష్‌ను మామిడి చెట్టుకు కట్టేసి చితకబాదారు. తీవ్రగాయాలపాలైన గణేష్ స్పృహ కోల్పోయాడు. దీంతో అక్కడి నుంచి పారిపోయారు నిందితులు. గ్రామస్తులు గుర్తించి గణేష్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తే అసలు విషయం బయటపడింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.