1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2023 (17:20 IST)

సంచలనం రేపుతున్న విద్యార్థిని రితీసాహు మృతి కేసు

rite sahu death case
ఇటీవల విశాఖపట్టణంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రితీ సాహు కేసు ఇపుడు సంచలనంగా మారింది. ఈ మృతిపై ఉన్న మిస్టరీని ఛేదించేందుకు సీఐడీని ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతో వెస్ట్ బెంగాల్ సీఐడీ పోలీసులు రంగంలోకి దిగారు. 
 
గత నెల 14వ తేదీన రితీసాహు భవనంపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఈమె స్వస్థలం వెస్ట్ బెంగాల్. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, ఈ మృతిపై విశాఖ పోలీసుల తీరుపై మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. నాలుగో పట్టణ పోలీసులు కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. 
 
హాస్టల్ యాజమాన్యం నుంచి లంచం తీసుకుని కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా సీసీటీవీ ఫుటేజీలోని లొసుగులపై నాలుగో పట్టణ సీఐపై బదిలీ వేటు పండింది. దీంతో ఈ కేసులో నాలుగో పట్టణ పోలీసుల వద్ద వెస్ట్ బెంగాల్ సీఐడీ పోలీసులు విచారణ జరుపనున్నారు.