గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (13:45 IST)

రాజస్థాన్ రాష్ట్రంలో మైనర్‌ కిడ్నాప్.. అత్యాచారం

victim
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికను కొందరు కామాంధులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికకు రాత్రంతా నరకం చూపించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని ధోల్​పుర్​ జిల్లా బారీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని భరత్‌పూర్‌లో ఈ నెల 26న సాయంత్రం బాధితురాలు.. కూరగాయలు కొనడానికి మార్కెట్​కు వెళ్లింది. అదేసమయంలో ఓ యువకుడు.. తన బైక్​పై బాలికను బలవంతంగా ఎక్కించుకుని బాసేడీ రోడ్డు టోల్ వద్ద వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఆరుగురు యువకులు.. ఆమెను కిడ్నాప్​ చేసి ఓ ఇంటికి తీసుకెళ్లారు. 
 
అక్కడ రాత్రంతా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక కుటుంబసభ్యులు తమ కుమార్తె కోసం వెతకడం ప్రారంభించారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. తర్వాత రోజు ఉదయం ఏడ్చుకుంటూ ఇంటికి చేరుకున్న బాధితురాలు.. తల్లిదండ్రులకు అసలు విషయాన్ని చెప్పింది. 
 
వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్​ చేశారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు. కేసు విచారణ జరుపుతున్నారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేర్చారు.