1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జులై 2022 (17:11 IST)

నాగ్‌పూర్‌లో దారుణం : 11 యేళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం

victim
నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. 11 యేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. గత నెల 19వ తేదీన తన ఇంటికి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగ్‌పూర్‌ పట్ణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తుంది. ఈమె తల్లిదండ్రులు ప్రతిరోజు కూలి పనికి వెళ్తారు. ఇదే అదనుగా తీసుకున్న ప్రధాన నిందితుడు కర్గంకర్ ​.. జూన్​ 19న బాలికను తన ఇంటికి తీసుకెళ్లి స్నేహితులతో కలిపి సామూహిక అత్యాచారం చేశాడు. 
 
ఆ తర్వాత కొంత డబ్బును ఇచ్చి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెప్పాడు. అక్కడి మూడు రోజులు తర్వాత.. ప్రధాన నిందితుడి మరికొంతమంది స్నేహితులు ఆమెపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. అలా పలుమార్లు అత్యాచారం చేశారు. అయితే అనుమానం వచ్చిన బాధితురాలి తల్లిదండ్రులు విషయాన్ని ఆరా తీయగా.. బాలిక మొత్తం చెప్పేసింది. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.