1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 డిశెంబరు 2023 (21:09 IST)

ఇంట్లో పనికి పెట్టుకున్న టీనేజ్ బాలికపై యజమానుల చిత్రహింసలు.. ఎక్కడ?

victim woman
తమ ఇంట్లో పాచిపని చేసేందుకు పెట్టుకున్న టీనేజ్ బాలికను ఇంటి యజమానులు చిత్రహింసలకు గురిచేశారు. లైంగికంగా వేధించారు. బాలికను కొట్టి, కుక్కలతో కరిపించి, దుస్తులు తొలగించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణం గురుగావ్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ తనకు తెలిసినవారి ద్వారా తన 13 యేళ్ల కుమార్తెను గురువావ్‌లోని సెక్టార్ 57లో ఉండే శశిశర్మ అనే వ్యక్తి ఇంటిలో పని చేసేందుకు పెట్టింది. ఆ బాలికకు నెలకు రూ.9 వేలు వేతనం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. 
 
మొదటి రెండు నెలలు అంతా సాఫీగానే సాగిపోయింది. ఆ తర్వాతే ఇంటి యజమాని శశిశర్మతో సమస్యలు మొదలయ్యాయి. ఆ టీనేజ్ బాలికపై ఇంటి యజమానులు చిత్రహింసలకు గురిచేశారు. బాలికను కొట్టి, కుక్కలతో కరిపించి, దుస్తులు తొలగించి, అసభ్యంగా ప్రవర్తించారు. ఓ రోజున కుమార్తెను చూసేందుకు వెళ్లగా, తన కుమార్తె ఓ గదిలో బందీగా కనిపించింది. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక నోటికి టేపు వేశారని, రెండు రోజులకు ఒకసారి మాత్రమే ఆహారం పెట్టేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
 
శశి శర్మ భార్య తన కుమార్తెను ఇనువ రాడ్డుతో కొట్టేందని, వాళ్ల కుమారుడు తన కుమార్తె దుస్తులు తొలగించి అసభ్యంగా తాకుతూ కెమెరాతో వీడియో చిత్రీకరించారని వాపోయింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.