సంబంధిత వార్తలు
- పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు
- ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం
- Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్
- Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్
ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్ను మహిళ కడపులో వదేలేశారు...
ఏపీలోని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వైద్యులు తన విధుల్లో నిర్లక్ష్యం వహించారు. ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసిన ఆ వైద్యుడు సర్జికల్ బ్లేడ్ను మహిళ కడపులో వదిలేశాడు. ఆ తర్వాత బాధిత మహిళకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా డాక్టర్ టి.నారాయణ స్వామి పనిచేస్తున్నారు. ఆయన నవంబరు నెల 26వ తేదీన ఓ మహిళకు క్యాబెక్టమీ ఆపరేష్ చేశారు. ఆపరేషన్ సమయంలో సర్జికల్ బ్లేడును ఆ మహిళ కడుపులోనే వదిలేశారు. ఆ తర్వాత ఆ మహిళకు కడుపునొప్పి రావడంతో వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించగా, ఈ విషయం బయటపడింది.
ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, ప్రాథమిక విచారణ నివేదికలో వైద్యడు నిర్లక్ష్యం స్పష్టంగా తేలింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. బాధ్యుడైన వైద్యుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖను ఆరోపించారు. సీఎం ఆదేశాలతో స్పందించిన ఉన్నతాధికారులు డాక్టర్ నారాయణ స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
