ganesh chaturthi

గోధుమ పిండి పరోటాలు ఎలా చేయాలో తెలుసా?

Written By సిహెచ్
Updated: శనివారం, 2 ఫిబ్రవరి 2019 (19:50 IST)
మనం ప్రతిరోజు రకరకాల అల్పాహారాలను చేసుకొని తింటూ ఉంటాం. కానీ పరోటాలు చాలా అరుదుగా మాత్రమే చేస్తూ ఉంటాం. కానీ పిల్లలు కొత్త ఐటమ్స్ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పరోటాలను పిల్లలకు ఇష్టం అయ్యేలా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు:
క్యాబేజీ తురుము- రెండు కప్పులు,
గోధుమపిండి- రెండు కప్పులు,
గరం మసాలా- అర టీ స్పూన్,
తరిగిన కొత్తిమీర- ఒక కట్ట,
పసుపు- చిటికెడు,
కారం- ఒక టీ స్పూన్,
నూనె- రెండు టీ స్పూన్లు,
నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు,
ఉప్పు- తగినంత,
నీళ్లు-తగినన్ని.
 
తయారీ విధానం...
క్యాబేజీ తురుములో కొద్దిగా ఉప్పువేసి ఉడకబెట్టి, ఉడికాక నీరు మెుత్తం పిండేయాలి. తర్వాత నూనె, నెయ్యి మినహా మిగిలిన పదార్ధాలన్నింటిని ఒక గిన్నెలో వేసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. చివర్లో నూనె కూడా వేసి కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పరోటాలు చేసుకొని పెనం మీద నెయ్యితో  కాల్చుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉంచే పరోటాలు రెడీ.

అన్నీ చూడండి

విశాఖపట్నం సెంట్రల్ పార్క్ బయట కరెన్సీ నోట్లు

ప్రధాని మోడీ స్కూల్‌మేట్ భూవివాదం పరిష్కారం...

ఇంట్లో పేదరికం తాండవిస్తున్నా.. ఒకే ఇంట్లో ఐదుగురు డాక్టర్లు అయ్యారు.. ఎక్కడ?

డీఎస్సీ-2025 కుంభకోణానికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా?: జగన్

అక్టోబరు 15 నుంచి యూపీఐ సేవలు భారం కానున్నాయా?

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments