వెదురు బియ్యం జావతో కీళ్ల నొప్పులు మటాష్ (video)

శనివారం, 16 నవంబరు 2019 (12:22 IST)
వెదురు బియ్యంతో చేసిన జావను రోజూ తాగితే కీళ్లనొప్పులు, నడుం నొప్పి తగ్గుతాయి. శరీరంలో వాపులు ఉంటే అవి అదుపులోకి వస్తాయి. మూత్రంలో వచ్చే మంట తగ్గుతుంది. జలుబు, దగ్గు ఎక్కువగా వేధిస్తుంటే వెదురుబియ్యం చూర్ణాన్ని తేనెతో కలిపి పుచ్చుకుంటే నయమవుతుంది. మధుమేహం ఉన్నవారు కొద్ది మొత్తంలో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
 
వెదురు బియ్యాన్ని వంశీలోచన అని కూడా అంటారు. వెదురుకర్ర ముదిరిన తర్వాత వాటికొచ్చే గింజల నుంచే ఈ బియ్యాన్ని సేకరిస్తారు. ఇవి చూడ్డానికి బార్లీ గింజల మాదిరిగా ఉండి, రుచిలో వగరుగా ఉంటాయి. అసోమీలు ఆరోగ్యానికి మంచిదని ఈ బియ్యంతో జావ కాచుకుని తాగుతారు.
 
అలాగే వెదురు బియ్యం ప్రతి కప్పు నుంచి 160 కెలొరీల శక్తి అందుతుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కొవ్వుశాతం చాలా తక్కువ. అయితే ఈ బియ్యాన్ని మితంగానే తినాలి. రోజుకి 15 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదం, ఫార్చునర్ కారు డివైడర్‌ను ఢీకొని మరో కారుని ఢీకొట్టింది, ఇద్దరు మృతి

జూలై 19, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో 20 అడుగుల కొండచిలువ కలకలం, వీడియో

మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

Vizag: 1.7 కిలోల బరువున్న శిశువుకు అరుదైన మెదడుకు శస్త్ర చికిత్స

అన్నీ చూడండి

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ

Soori: సుహాస్, సూరి నటించిన మండాడి చిత్రాన్ని విడుదలచేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్

తర్వాతి కథనం
Show comments