Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్కెర ఆరగిస్తే మధుమేహ వ్యాధి వస్తుందా?

Written By ఠాగూర్
Updated: బుధవారం, 14 జూన్ 2023 (15:43 IST)
దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ప్రపంచ మరణాల్లో అత్యధికంగా డయాబెటిక్ వ్యాధివల్లే సంభవిస్తున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ మధుమేహం వ్యాధి ఎక్కువగా తీపి పదార్థాలు తినే వాళ్లకు వస్తుందనేది అపోహ ఉంది. కానీ, వైద్యులు కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమేని చెపుతున్నారు.
 
నిజానికి చక్కెర తినడం వల్ల మధుమేహుల్లో చక్కెర నియంత్రణలో ఉండదు. కుటుంబ చరిత్రలో మధుమేహం లేకపోయిన చక్కెర ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు 30 నుంచి 40 శాతం మేరకే ఉంటాయని తెలిపారు. ఇందుకు కారణం చక్కెర ద్వారా అధిక క్యాలరీలు శరీరంలోకి చేరుతూ శరీరం బరువు పెరిగి 'ఇన్సులిన్ రెసిస్టెన్స్'కు గురికావడమేనని తెలిపారు. దీని వల్ల మధు మేహం సమస్య మొదలవుతుందని తెలిపారు., అందువల్ల 
 
జన్యుపరంగా సంక్రమించే సమస్య ఇది. కాబట్టి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఈ సమస్య ఖచ్చితంగా రాదు అని చెప్పడానికి వీల్లేదు. అయితే ఎప్పుడు ఈ సమస్య బారిన పడతాం అనేది, మనం అనుసరించే జీవనశైలి మీదే ఆధారపడి ఉంటుంది. కుటుంబ చరిత్రలో మధు మేహం ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే, ఈ సమస్య కాస్త ఆలస్యంగా 50 నుంచి 60 ఏళ్ల వయసులో తలెత్తే అవ కాశాలుంటాయి.
 
కుటుంబ చరిత్రలో మధుమేహం లేనంత మాత్రాన ఆ సమస్య బారిన పడే అవకాశాలు పూర్తిగా ఉండవని చెప్పడానికి వీల్లేదు. కుటుంబ చరిత్రలో షుగర్ ఉండీ, జీవనశైలి కూడా అస్త వ్యస్థంగా ఉండీ, ఆహారం మీద నియంత్రణ లేకపోవడం, విపరీతమైన ఒత్తిడికి లోనవడం, వ్యాయామం చేయకపోవడం, నిద్రవేళలు గతి తప్పడం లాంటివి కూడా తోడైతే, 35 నుంచి 40 ఏళ్లకే ఈ రుగ్మత బారిన పడతాం. నిజానికి 20 నుంచి 30 ఏళ్ల క్రితం ఈ పరిస్థితి ఉండేది కాదు. అప్పట్లో ఆరోగ్యకరమైన జీవనవిధానం, ఆహారపుటలవాట్ల వల్ల 50 ఏళ్లు పైబడిన వాళ్లకే మధుమేహం వస్తూ ఉండేది. అలాగే కొవిడ్ సమయంలో స్టీరాయిడ్ల వాడకం ఇపుడు ఈ వ్యాధిబారినపడే వారి సంఖ్య పెరిగిపోయింది.

అన్నీ చూడండి

నేపాల్ ఫ్లాష్ ప్లడ్‌కి కారణం హిమ గిరుల్లో 4.4 తీవ్రతో ఏర్పడిన భూకంపమే, ఐసు కొండ బద్ధలైంది

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం

యువత ఆకాంక్షలే తెలంగాణ కొత్త గృహ కొనుగోలుదారుల చోదక శక్తులు: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్

మా కైలాష్ యాత్ర బృందాలలో ఒకటి నేపాల్ వరదల్లో చిక్కుకుంది, వారి ఆచూకి అందలేదు: సద్గురు జగ్గీ వాసుదేవ్

సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026: కోకా-కోలా బెవరేజెస్ బృందంతో ఏపీ మంత్రి టి.జి. భరత్

అన్నీ చూడండి

Prakash Raj: డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ సినిమా ఫాదర్ టీజర్ రిలీజ్

king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Mandadi teaser: విజువల్స్, బోట్ సీక్వెన్స్ తో సుహాస్, సూరి ల మండాడి టీజర్

Taapsee Pannu : అప్పుడే మేము దానిని వేడుకలా జరుపుకుంటాం : తాప్సీ పన్ను

ప్రియదర్శి.. ఇడుపు కాయితం నుంచి శ్రీలత సాంగ్ ప్రోమో రిలీజ్

తర్వాతి కథనం
Show comments