ఆర్నెల్లకోసారి దంతవైద్యుడుని సంప్రదించాలి.. లేకుంటే...

దంతాల సంరక్షణతో పాటు వాటి ఆరోగ్యం చాలా ముఖ్యం. వీటిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే, ఇటీవలి కాలంలో దంతాలకు సంబంధించిన అవగాహన బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువమం

శుక్రవారం, 24 ఆగస్టు 2018 (14:01 IST)
దంతాల సంరక్షణతో పాటు వాటి ఆరోగ్యం చాలా ముఖ్యం. వీటిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే, ఇటీవలి కాలంలో దంతాలకు సంబంధించిన అవగాహన బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువమంది డయాబెటిక్ రోగులు ఈ దంత సమస్యల బారినపడుతున్నారు. అందుకే దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
 
* ప్రతిరోజూ రెండు సార్లు పళ్లు తోముకోవాలి. (రాత్రి నిద్రకు ముందు, పొద్దున్న నిద్ర లేవగానే)
*  బ్రష్ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌నే వాడాలి.
* మంచి టూత్‌పేస్ట్‌ను ఎంచుకోవాలి.
 
* పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకూ నిలువుగా బ్రష్ చేసుకోవాలి.
* రఫ్‌గా బ్రష్ చేసుకుంటే చిగుళ్లకు హాని కలుగుతుంది. దీంతో చిగుళ్లు త్వరగా వ్యాధులకు గురవుతాయి.
* పంటికి బయటవైపే కాదు లోపలి వైపునా బ్రష్ చేసుకోవాలి. నమిలే ప్రదేశాల్లో పంటి పైన వెడల్పుగా ఉండే ప్రాంతంలోనూ బ్రష్ చేసుకోవాలి.
*  కనీసం రెండు నిముషాలపాటు బ్రష్ చేసుకోవాలి.
 
* నాలుకపైన ఉన్న బ్యాక్టీరియాను తొలగించుకోవడానికి 30 సెకన్లపాటు స్క్రబ్ చేయాలి.
* చేత్తో చిగుళ్లను మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగవుతుంది.
*  ప్రతి మూడు నెలలకు ఓ సారి బ్రష్‌ను మార్చేయాలి. 
 
* చిన్నపిల్లలు ఉన్నవారు ప్రతి 6 నెలలకోసారి వారిని డెంటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలి.
* మధుమేహ రోగులు తప్పనిసరిగా దంత వైద్యులను క్రమం తప్పకుండా సంప్రదించాలి. 

అన్నీ చూడండి

నెలకు ఇంటి అద్దె రూ.80 వేలు.. అయినా క్యాబ్ డ్రైవర్

నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు

నేతలెవ్వరూ గాంధీ భవన్ వైపు రావొద్దంటున్న సీఎం రేవంత్ రెడ్డి

మామ ప్రైవేట్ భాగాన్ని బ్లేడుతో కోసేసిన కోడలు (వీడియో)

పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఉద్ధవ్‌కు తేరుకోలేని షాకిచ్చిన ఎంపీలు

అన్నీ చూడండి

'రామాయణం' చిత్రం కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments