సోంపు గింజలు తింటే.. ఏమవుతుంది..?

గురువారం, 24 జనవరి 2019 (10:24 IST)
నేటి తరుణంలో తరుచు అందరిని వేధించే సమస్య అజీర్తి. దీని కారణంగా ఆహారాన్ని భుజించాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఒకవేళ తిన్నా కడుపులో వికారంగా, వాంతి వచ్చే మాదిరిగా ఉంటుంది. దాంతో కళ్లు తిరగడం, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలని అడిగితే మెడికల్లో దొరికే మాత్రలు వాడితే చాలని చెప్తుంటారు. అది నిజమే అయినా ఎప్పుడూ ఆ మాత్రలే వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
 
సోంపు గింజలు: 
సాధారణంగా హోటల్‌కి వెళ్లినప్పుడు భోజనం తిన్న తరువాత వారు సోంపు ఇస్తారు. ఎందుకో తెలుసా.. తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఇస్తారు. అందువలన మీరు కూడా అజీర్తి అనిపించినప్పుడు 1 స్పూన్ సోంపు గింజలు తీసుకుంటే.. తక్షణమే అజీర్తి నుండి ఉపశమనం లభిస్తుంది. సోంపులోని యాంటీ ఆక్సీడెంట్స్, పీచు పదార్థం ఈ సమస్యను తగ్గించడానికి ఎంతగానో దోహదపడుతాయి. కనుక ప్రతిరోజూ భోజనాంతరం ఓ స్పూన్ సోంపు గింజలు తీసుకోండి చాలు...
 
అల్లం:
అల్లం ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉంటుంది. దీనిని వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అల్లాన్ని ఏ కూరలో వేసుకున్నా ఆ కూరకి చక్కని రుచి వస్తుంది. తినడానికి చాలా బాగుంటుంది. ఈ అల్లాన్ని వంటకాల్లోనే కాదు.. టీలో కూడా వేసుకుంటారు. అల్లం తీసుకుంటే అజీర్తి ఉండదు. అల్లంలోని విటమిన్స్, న్యూట్రియన్ ఫాక్ట్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందించడమే కాకుండా.. కడుపులోని వ్యర్థాలను తొలగిస్తాయి. అజీర్తిగా అనిపించినప్పుడు.. అల్లం రసాన్ని తాగి చూడండి.. ఫలితం ఉంటుంది. 

అన్నీ చూడండి

ఔటర్ రింగ్ రోడ్డు దక్షిణ ప్రాంతానికి అనుమతిలివ్వండి : సీఎం రేవంత్ రెడ్డి

Bhogapuram Airport: ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్‌గా భోగాపురం

గోదావరి జల వివాదం- తెలంగాణ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

జయలలితకో న్యాయం.. జగన్మోహన్ రెడ్డికో న్యాయమా? మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రశ్న

కర్నూలు హిట్ అండ్ రన్ కేసు.. జాగింగ్ వెళ్తూ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మృతి

అన్నీ చూడండి

Kalki 2 update: కల్కి సీక్వెల్ అప్‌డేట్, భారతాన్ని వక్రీకరిస్తున్న నాగ్ అశ్విన్ !

Balakrishna: తారక్ (జూ.ఎన్.టి.ఆర్.) రాజకీయ ప్రవేశంపై బాలక్రిష్ణ స్పందన హైలైట్

Sandeep Reddy Vanga: సత్యదేవ్ నటన సంచలనాత్మకం : రావు బహదూర్ పై సందీప్ రెడ్డి వంగా రివ్యూ

కోలీవుడ్‌లో తండ్రీతనయుల పోటీ.. చివరకు వెనక్కి తగ్గిన కుమారుడు...

పట్టభద్రులైన విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్

తర్వాతి కథనం
Show comments