తుమ్ములు ఆగకుండా వస్తున్నాయా? ఇలా చేస్తే సరి

Written By సిహెచ్
Updated: సోమవారం, 14 సెప్టెంబరు 2020 (22:33 IST)
మెంతులు, వాము, మిరియాలు విడివిడిగా వేయించి, చూర్ణం చేసి ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని రోజూ ఉదయం ఒక తమలపాకులో ఒక గ్రాము చూర్ణం, అర టీ స్పూను తేనె కలిపి ఆకుని చుట్టి మొత్తం నమిలి మింగాలి. ఇందువల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అలర్జీతత్వం తగ్గి సమస్య తగ్గిపోతుంది.
 
అలాగే శిరోజాలు బాగా పెరిగేందుకు మెంతులు, మినుములు, ఉసిరక పెచ్చుల చూర్ణాలను ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున తీసుకుని అన్నింటిని కలిపి సీసాలో నిల్వ వుంచుకుని వారంలో రెండుసార్లు రాత్రిపూట తగినంత పొడిని తీసుకుని అది బాగా మునిగేటట్లు నిమ్మరసం పోసి ఉదయం వరకూ నానించి పదార్థాన్నంతా బాగా కలిపి తలకు పట్టించి రెండు గంటల ఆగి కుంకుడు లేదా శీకాయ పొడితో తలస్నానం చేయాలి. ఐతే గర్భస్రావం కలుగజేసే గుణం వున్నందున గర్భవతులు మెంతులు వాడకపోవడం మంచిది.
 
కొలస్ట్రాల్ సమస్యకు 150 గ్రాముల మెంతి పొడి, 50 గ్రాముల శొంఠి పొడి కలిపి వుంచుకుని రోజూ ఉదయం, సాయంత్రం పూటకు 2 నుంచి 3 గ్రాముల పొడిని తగినంత తేనెతో కలిపి సేవిస్తుంటే మంచి కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గి చక్కటి ఆరోగ్యానికి దోహదపడుతుంది. అంతేకాకుండా దీనివల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి.

అన్నీ చూడండి

కోడిచెరువును పవన్ కబ్జా చేసారన్నవారు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో?!!

నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా వుంటోంది.. అన్నామలై

సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు?

మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments