తుమ్ములు ఆగకుండా వస్తున్నాయా? ఇలా చేస్తే సరి

సోమవారం, 14 సెప్టెంబరు 2020 (22:31 IST)
మెంతులు, వాము, మిరియాలు విడివిడిగా వేయించి, చూర్ణం చేసి ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని రోజూ ఉదయం ఒక తమలపాకులో ఒక గ్రాము చూర్ణం, అర టీ స్పూను తేనె కలిపి ఆకుని చుట్టి మొత్తం నమిలి మింగాలి. ఇందువల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అలర్జీతత్వం తగ్గి సమస్య తగ్గిపోతుంది.
 
అలాగే శిరోజాలు బాగా పెరిగేందుకు మెంతులు, మినుములు, ఉసిరక పెచ్చుల చూర్ణాలను ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున తీసుకుని అన్నింటిని కలిపి సీసాలో నిల్వ వుంచుకుని వారంలో రెండుసార్లు రాత్రిపూట తగినంత పొడిని తీసుకుని అది బాగా మునిగేటట్లు నిమ్మరసం పోసి ఉదయం వరకూ నానించి పదార్థాన్నంతా బాగా కలిపి తలకు పట్టించి రెండు గంటల ఆగి కుంకుడు లేదా శీకాయ పొడితో తలస్నానం చేయాలి. ఐతే గర్భస్రావం కలుగజేసే గుణం వున్నందున గర్భవతులు మెంతులు వాడకపోవడం మంచిది.
 
కొలస్ట్రాల్ సమస్యకు 150 గ్రాముల మెంతి పొడి, 50 గ్రాముల శొంఠి పొడి కలిపి వుంచుకుని రోజూ ఉదయం, సాయంత్రం పూటకు 2 నుంచి 3 గ్రాముల పొడిని తగినంత తేనెతో కలిపి సేవిస్తుంటే మంచి కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గి చక్కటి ఆరోగ్యానికి దోహదపడుతుంది. అంతేకాకుండా దీనివల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి.

అన్నీ చూడండి

డ్రగ్స్, యువతి కోసమే విజయవాడలో యువకుల థార్ జీపులతో ఢీకొట్టుకున్నారట

జీవవైవిధ్య దినోత్సవం: ఐటీసీ మడ అడవుల సంరక్షణ ద్వారా తీరప్రాంత పర్యావరణ వ్యవస్థ బలోపేతం

త్వరలోనే ఏఐ ఆధారిత వైద్య సేవలు.. చంద్రబాబు నాయుడు

వైకాపా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే .. 11 అరాచకాలు ఇవిగోండి : సీఎం చంద్రబాబు ధ్వజం

అయ్యా సీఎం విజయ్ నీ ఉచిత కరెంట్ మాకొద్దు, డబ్బులిస్తాం ఇవ్వు నాయనా: తమిళనాడులో మొదలైన అసంతృప్తి, వీడియో

అన్నీ చూడండి

Nikhil: స్వయంభూ విఎఫ్.ఎక్స్. టెక్నీషియన్లను పర్యవేక్షించిన నిఖిల్, సెంథిల్

Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

Allu Arjun: అల్లు అర్జున్ శక్తిమాన్‌గా చేస్తున్నాడా?

Sandhigdham: సందిగ్ధం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది : పార్ధసారథి

అవి నా ఫోటోలు కాదు.. ఏఐ సృష్టించిన చిత్రాలు.. రుక్మిణి వసంత్

తర్వాతి కథనం
Show comments