తిరుమలలో సాధారణ రద్దీ
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 35,085 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రికి 13 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి సర్వ దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి కనీసం 7 గంటల సమయం పడుతోంది.
నడక దారిన వచ్చే భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి కనీసం 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం ఉదయం పదిగంటల పైన ప్రారంభం అవుతోంది. ఇక భక్తులకు గదులు కూడా సులభంగానే లభిస్తున్నాయి.