తిరుమలలో సాధారణ రద్దీ
తిరుమలలో శుక్రవారం భక్తులతో తిరుమల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలలో గురువారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 39,474 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో5 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. .
ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంట్లలో ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వారికి కనీసం 3 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం నుంచి రద్దీ పెరిగే ఉండే అవకాశం ఉంది. పదవ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో మెల్ల మెల్లగా పెరిగే అవకాశం ఉంది.