1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (19:06 IST)

ఆప్ఘనిస్థాన్‌లోని మసీదులో భారీ పేలుడు: వందమంది మృతి

ఆప్ఘనిస్థాన్‌లోని మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో వందమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. షియా ముస్లింలు మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. దీనిపై తాలిబన్ల ప్రత్యేక బృందం ఘటనస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తుందని తెలిపారు. 
 
కుందుజ్‌లోని ఆసుపత్రులకు తీసుకువస్తున్న క్షతగాత్రుల సంఖ్య అంతకంతకు పెరుగుతోందని ఓ వైద్యుడు తెలిపారు. ఇటీవల షియా ముస్లిం వర్గానికి ఐసిస్-కె ఉగ్రవాద సంస్థ నుంచి పలు హెచ్చరికలు వచ్చినట్టు తెలుస్తోంది. దాడి జ‌రిగిన స‌మ‌యంలో మ‌సీదులో వంద‌ల మంది ముస్లింలు ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. దాడి ఘ‌ట‌న‌లో క్ష‌త‌గాత్రుల‌తో కుందుజ్ సెంట్ర‌ల్ ఆస్ప‌త్రి కిక్కిరిసిపోయింది. 
 
ఈ ఘ‌ట‌న‌లో త‌మ ఆస్ప‌త్రికి ఇప్ప‌టికి 35 మృత‌దేహాలు తీసుకువ‌చ్చార‌ని, 50 మంది గాయ‌ప‌డిన వారికి చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. ఇక ఇత‌ర ఆస్పత్రుల్లోనూ బాధితులు చికిత్స పొందుతున్నారు.