శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (13:12 IST)

భారత్‌తో సరిహద్దు తలనొప్పి : రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచిన చైనా

ఇటీవలి కాలంలో భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. చైనా బలగాలు హద్దుమీరుతుంటే.. వాటిని భారత్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనా తన రక్షణ బడ్జెట్​ను భారీగా పెంచింది. ఈ ఏడాది 209 బిలియన్​ డాలర్లు రక్షణ శాఖకు కేటాయించింది. ఇది గతేడాదితో పోల్చుకుంటే 6.8 శాతం ఎక్కువ. 
 
రక్షణ బడ్జెట్​ను చైనా ఏటికేడు పెంచుకుంటూపోతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక వ్యవస్థ కలిగిన చైనా‌.. ఈ సంవత్సరం రక్షణ రంగానికి 209 బిలియన్‌ డాలర్లు కేటాయించినట్లు నేషనల్​ పీపుల్స్ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​పీసీ) పార్లమెంట్​లో ప్రకటించింది. ఇది భారత రక్షణ బడ్జెట్‌కు మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. 
 
ఇది గతేడాదితో పోల్చుకుంటే 6.8 శాతం అధికంగా ఉంది. ఇది ఎవరినీ భయపెట్టడానికి కాదని.. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికేనని చైనా స్పష్టం చేసింది. శాంతియుత అభివృద్ధి, భద్రతా విధానాలకు తమ దేశం కట్టుబడి ఉందని తెలిపింది .ఒక దేశం ఇతరులకు ముప్పు కలిగిస్తుందా లేదా అనేది.. ఆ దేశ రక్షణ విధానంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది.